Friday, May 3, 2024

సెల్ఫి నిరాక‌రించాడ‌ని పృథ్వీ షాపై దాడి – 8 మందిపై కేసు..

ముంబై: క్రికెటర్ పృథ్వీ షా , అతడి స్నేహితుడిపై ముంబైలో దాడి జరిగింది. పృథ్వీ షా కూర్చొని ఉన్న కారు అద్దాలను బేస్‌బాల్ బ్యాట్లతో ధ్వంసం చేశారు. సెల్ఫీ అడిగితే నిరాకరించడమే ఈ దాడికి కారణమైంది. పృథ్వీ షా, తన ఫ్రెండ్‌ ఆశిష్ సురేంద్ర లు డిన్నర్ చేసేందుకు ఇటీవ‌ల‌ ముంబైలోని ఓ ఫైవ్-స్టార్ హోటల్‌కు వెళ్లారు. అయితే క్రికెటర్ గుర్తించిన ఇద్దరు వ్యక్తులు సెల్ఫీ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. పృథ్వీ షా నిరాకరించడంతో నిందితులు దీంతో అవమానంగా భావించి మ‌రికొంత‌మందితో వ‌చ్చి హోట‌ల్ బ‌య‌ట‌ బీఎండబ్ల్యూ కారులో పృథ్వీ షా కూర్చొని ఉండగానే నిందిత వ్యక్తులు దాడి చేశారు. బేస్‌బాల్ బ్యాట్లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ దాడి ఘ‌ట‌న‌లో మొత్తం 8 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement