Monday, May 6, 2024

విహార యాత్ర‌లో విషాదం – న‌లుగురు హైద‌రాబాదీలు దుర్మ‌ర‌ణం

హైదరాబాద్‌: కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా నలుగురు హైదరాబాద్‌ వాసులు మృతి చెందారు. హైదరాబాద్‌కు చెందిన నలుగురు టీఎస్‌ 29పీ 3693 కారులో విహార యాత్రకు వెళ్తుండగా కర్ణాటకలోని కొప్పల జిల్లా బడ్నేకుప్ప వద్ద మరో వాహనం వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన వెన్నల వర్ధిని, రూపావతి, షణ్ముఖ, విక్రమ్‌గా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement