Wednesday, May 15, 2024

IndvsEng | ప్రారంభ‌మైన టెస్ట్ మ్యాచ్ టికెట్ల విక్రయం.. ఎక్క‌డంటే !

హైదరాబాద్ ఉప్పల్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ నెల 25న జరగనున్న భారత్‌ – ఇంగ్లాండ్ తొలి టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌కి సర్వం సిద్ధమైంది. కాగా, ఈ మ్యాచ్‌ టికెట్ల అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. ఇవ్వాల సాయంత్రం ఏడుగంటల నుంచి పేటీఏం ఇన్‌సైడర్‌ మొబైల్‌ యాప్‌తో పాటు ఇన్‌ సైడర్‌ వెబ్‌ సైట్‌లో టికెట్లను విక్రయించనున్నట్లు హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్ తెలిపింది.

కాగా, ఈ మ్యాచ్‌కు సంబంధించిన కనీస టికెట్‌ ధర రూ. 200 కాగా.. గరిష్ఠంగా రూ. 4 వేలు ఉంది. మిగిలిన టిక్కెట్లను 22వ తేదీ నుంచి ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా అమ్మనున్నట్లు ప్రకటించింది. పాఠశాల విద్యార్థుల‌కు ఉచితంగా మ్యాచ్‌ని తిలకించేందుకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అవకాశం కల్పించింది. రిప‌బ్లిక్ డే రోజున భార‌త సాయుధ ద‌ళాల సిబ్బందికి సైతం అవకాశమిచ్చింది. టెస్టు మ్యాచ్ టిక్కెట్ ధ‌రలు 200 నుంచి 4 వేల రూపాయల వరకు నిర్ణయించారు.

కొనసాగుతున్న విశాఖ టెస్ట్‌ టికెట్ల విక్రయం

- Advertisement -

విశాఖలో ఇండియా – ఇంగ్లాండ్ మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ విశాఖ VDCA స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు జరుగుతుందని ACA కమిటీ సభ్యలు వెల్లడించారు. మ్యాచ్ కోసం ఆన్ లైన్ లో టికెట్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే 26 నుంచి ఆఫ్ లైన్ లో టికెట్లు అమ్మకాలను ఉంచుతామన్నారు.

అదే విధంగా రోజుకు 2000 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని ACA కమిటీ సభ్యలు తెలిపారు. రెండు క్రికెట్ జట్లకు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని జల్లా కలెక్టర్ మల్లిఖకార్జున అన్నారు. స్టేడియం దగ్గర ఎలాంటి సంఘనలు జరగకుండా…ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూస్తామని నగర సీపీ రవి శంకర్ అయ్యర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement