Sunday, May 19, 2024

Big Breaking: వన్డే మ్యాచ్​ 25 ఓవర్లలోనే ఖతం.. రఫ్పాడించిన భారత బౌలర్లు

ఇంగ్లండ్​ తో జరుగుతున్న వన్డే మ్యాచ్​ని టీమిండియా టీ20 మాదిరిగా ఆడేసింది. నిర్ణీత 50 ఓవర్లకు గాను 25 ఓవర్లలోనే మొత్తం వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్​ని ఘోరంగా దెబ్బతీసింది. ఇక ఈ క్రమంలో ఇంగ్లండ్​ బ్యాట్స్​మన్​ సైకిల్​ స్టాండ్​ లెక్క వన్​ బై వన్​ పెవిలియన్​కు క్యూ కట్టారు. మొదటి నాలుగు ఓవర్లలోనే కీలకమైన ముగ్గురు బ్యాట్స్​మన్​ని డకౌట్​ చేశారు బుమ్రా, షమీ. ఇక ఆ తర్వాత వచ్చిన మిడిలార్డర్​ బ్యాట్స్​మన్​ కూడా మన బౌలర్ల దెబ్బకు తట్టుకోలేకపోయారు. కాగా, ఈ మ్యాచ్​లో బుమ్రా అద్భుత ప్రదర్శన కనబరిచి 6వికెట్లు పడగొట్టాడు. షమీ 3 వికెట్లు తీయగా, పి క్రిష్ణ ఒక వికెట్​ తో అలరించాడు.

ఇక.. ఇంగ్లండ్​ టాపార్డర్​ రాయ్​ (0), బెయిరొస్టో (7), రూట్ (0), బెన్‌స్టోక్స్ (0), జాస్ బ‌ట్ల‌ర్ (30), లివింగ్‌స్టోన్ (0), ఎం అలీ (14), డి.విల్లే (21), సి. ఓవ‌ర్ట‌ర్ (8), బి. కార్సే (15), ఆర్‌. టోప్లే (6) ప‌రుగులు చేశారు. ఈ ఇన్నింగ్స్‌లో భార‌త టీమ్ 9 ఎక్స్‌ట్రా ప‌రుగులు ఇచ్చింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement