Monday, April 29, 2024

Big Breaking | వెస్టిండీస్​తో టీ20.. భారత కుర్రాళ్ల జట్టు ఇదే!

వెస్టిండీస్​తో జరిగే టీ20 మ్యాచ్​లకు సంబంధించి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆగస్టు 3వ తేదీ నుంచి వెస్టిండీస్​, భారత జట్ల మధ్య మ్యాచ్​లు జరగనున్నాయి. టీ20లకు హార్దిక్​ పాండ్యా కెప్టెన్​గా ఉంటారు. అయిదు టీ20లు జరగనుండగా.. భారత జట్టులో ఇషాన్​ కిషాన్​, గిల్​, జైశ్వాల్​, తిలక్​వర్మ, సూర్యకుమార్​, సంజు శాంసన్​, అక్షర్​ పటేల్​, చాహల్​, కుల్దీప్​, రవి బిష్ణోయ్​, అర్షదీప్​ సింగ్​, ఉమ్రాన్​ మాలిక్​, ఆవేశ్​ ఖాన్​, ముఖేశ్​ కుమార్​ ఎంపికయ్యారు.

ఇక.. ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ ఆగస్టు 3న వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే T20I సిరీస్‌కు తన తొలి జాతీయ కాల్-అప్ అందుకున్నాడు. భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ బుధవారం జట్టును ప్రకటించింది. ఇప్పటికే టెస్టులు, వన్డేలకు జట్లను కూడా ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement