సన్రైజర్స్తో జరుగుతున్న పోరులో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుసగా ఐదు ఓటములు చవి చూసిన సన్రైజర్స్.. ఈ మ్యాచ్లో విజయం సాధించి, ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై.. సన్రైజర్స్ అవకాశాలకు కూడా గండి కొట్టాలని చూస్తోంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ.. తమ జట్టులో రెండు మార్పులు చేసినట్లు చెప్పాడు. హృతిక్ షోకీన్, కుమార్ కార్తికేయ ఆడటం లేదని, వారి స్థానాల్లో మయాక్ మార్కండే, సంజయ్ యాదవ్ ఆడుతున్నారని వెల్లడించాడు. అలాగే తమ జట్టులో కూడా రెండు మార్పులు ఉన్నట్లు విలియమ్సన్ తెలిపాడు. శశాంక్ సింగ్ స్థానంలో ప్రియమ్ గర్గ్, మార్కో జాన్సెన్ స్థానంలో ఫజల్ ఫరూఖీ ఆడుతున్నట్లు చెప్పాడు.
సన్రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠీ, ప్రియమ్ గర్గ్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, ఫజల్లాక్ ఫరూఖీ
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ యాదవ్, టిమ్ డేవిడ్, డానియల్ శామ్స్, రమణ్దీప్ సింగ్, సంజయ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మయాంక్ మార్కండే, రైలీ మెరెడిత్
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..