Sunday, April 28, 2024

సౌరవ్ గంగూలీ బయోపిక్..హీరో ఎవరో తెలుసా..?

గత కొంతకాలంగా క్రీడాకారుల జీవితాలపై ఎక్కువగా దృష్టి పెడుతోంది బాలీవుడ్ పరీశ్రమ. ఇప్పటికే మిల్కా సింగ్, సైనా నెహ్వాల్, మహేంద్ర సిన్ ధోని, గీతా ఫోగట్ వంటి పలువురు క్రీడాకారుల జీవితాలపై బయోపిక్స్ చేసి వెండితెరపై ప్రదర్శించారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు రంగం సిద్ధమైంది. హిందీలో తెరకెక్కనున్న ఈ సినిమాకు గంగూలీ కూడా పచ్చజెండా ఊపాడు. సౌరవ్ గంగూలీ..ఇండియన్ క్రికెట్ లో ఈ పేరుకు ఓ ప్రత్యేక స్థానం ఖచ్చింగా ఉంటుంది..టీమిండియా ఎదుగుదలలో దాదా పాత్ర మరువలేనిది.. విపత్కర పరిస్థితుల్లో కెప్టెన్ గా జట్టు పగ్గాలు చేపట్టిన గంగూలీ టీమ్ ను ముందుకు నడిపిన తీరు అద్భుతం.. ఆ తరువాత ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు.. అందుకే బయోపిక్ కు కావల్సిన దానికంటే ఎక్కువే గంగూలీ తన కెరియర్ లో సాధించాడని.. సచిన్, ధోని బయోపిక్ లలో వారి ఎదుగుదల మాత్రమే ఉంటుంది.. కాని గంగూలీ బయెపిక్ లో టీమిండియా ఎదుగుదల కనిపిస్తుందని ఈ మధ్య సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వచ్చాయి..

ప్రస్తుతం ఈ బయోపిక్ కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మూవీ యూనిట్ మునిగిపోయిందని బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.200కోట్ల నుంచి రూ.250 కోట్ల బడ్జెట్‌తో గంగూలీ బయోపిక్ తీయనున్నట్లు తెలుస్తోంది. ఈమేరక బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా కన్‌ఫాం చేశాడు. ఓ మీడియాతో మాట్లాడిన ఆయన.. బయోపిక్ తీసేందుకు ఒప్పుకున్నట్లు వెల్లడించాడు. అయితే ఇందులో దర్శకుడు, హీరో ఎవరనే విషయాలు ఇంకా సస్పెన్స్ గానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ బయోపిక్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. దాదా జీవిత కథలో నటించడానికి ఓ స్టార్ హీరోను ఫిక్స్ చేశారనే టాక్ నడుస్తోంది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ దాదా బయోపిక్ లో, ఆయన పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. కానీ ఆ జాబితాలో మరో ఇద్దరు స్టార్ హీరోల పేర్లు కూడా ఉన్నాయట.

ఇది కూడా చదవండి: అబ్బాయిలకు వల.. ముగ్గురిని పెళ్ళాడిన కిలాడి లేడీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement