Sunday, April 28, 2024

Birmingham : తొలి రౌండ్‌లో సింధూ విజయం

ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ లో భారత స్టార్‌ పీవీ సింధు రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. మరోవైపు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, ఆకర్షి కశ్యప్‌లకు తొలి రౌండ్‌లోనే షాక్‌ తగిలింది. గత రాత్రి జరిగిన మహిళల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో మాజీ వరల్డ్‌ నెం.1 పీవీ సింధు 21-10తో ఆధిక్యంలో ఉన్న సమయంలో జర్మనీ ప్రత్యర్థి యొన్నె లీ మ్యాచ్‌ మధ్యలోనే తప్పుకుంది. దాంతో అంపైర్లు సింధును విజేతగా ప్రకటించారు.

ఇక్కడ జరిగిన మరో సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్‌ 16-21, 11-21 తేడాతో చేనీస్‌ తైపీ షట్లర్‌ పై యు పో చేతిలో వరుస గేముల్లో ఓడింది. పురుషుల సింగిల్స్‌లో భారత నెంబర్‌ వన్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌కు తొలి రౌండ్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఏడో సీడ్‌ ప్రణయ్‌ 21-14, 13-21, 13-21 తేడాతో సు లి యంగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడి తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమిం చాడు. మొదటి గేమ్‌ను గెలుచుకున్న ప్రణయ్‌ తర్వాతి గేముల్లో మాత్రం తేలిపో యాడు. మరో సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 9-21, 9-21 వరల్డ్‌ నెంబర్‌ వన్‌ విక్టర్‌ అక్సెెల్‌సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో చిత్తుగా ఓడిపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement