Thursday, April 25, 2024

బరిలోకి సచిన్‌, సెహ్వాగ్‌

న్యూఢిల్లి: భారత బ్యాటింగ్‌ దిగ్గజాలు సచిన్‌, సెహ్వాగ్‌ మళ్లిd బరిలోకి దిగనున్నారు. రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌లో ఆడేందుకు లారా, బ్రెట్‌లీ, దిల్హాన్‌, మురళీధరన్‌ తదితరులు ఆడనున్నారు.మార్చి 2 నుంచి 21వరకు ఈ టోర్నీ రాయ్‌ పూర్‌లోని షాహీద్‌ వీర్‌ నారాయణసింగ్‌ స్టేడియంలో జరగ నుంది. కాగా గతేడాది కరోనా కారణంగా ఈ టోర్నీ వాయి దా పడింది. నాలుగు మ్యాచ్‌ల అనంతరం సిరీస్‌ను నిలిపి వేశారు. సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లను రాయ్‌పూర్‌ స్టేడి యంలో నిర్వహించనున్నారు. దేశంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ టీ20 టోర్నీ లో మరోసారి మెరిసేందుకు మాజీ దిగ్గజ క్రికెటర్లు సన్నద్ధం అవుతున్నారు. బయోబబుల్‌ వాతావరణంలో ఈ టోర్నీని నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement