Saturday, May 4, 2024

Breaking: రుతురాజ్ అవుట్.. నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై.. త‌డ‌బ‌డుతున్న బ్యాట్స్‌మ‌న్‌

టాటా ఐపీఎల్ 2022లో భాగంగా ఇవ్వాల‌ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. కాగా తొలుత పంజాబ్ బ్యాటింగ్ చేసి 187 ప‌రుగుల టార్గెట్ పెట్టింది.. ఈ క్ర‌మంలో చెన్నై సెకండ్ ఇన్సింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగ‌గా ఆదిలోనే త‌డ‌బ‌డుతూ లైనప్ త‌ప్పుతోంది. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఊతప్ప (1), శాంట్నర్ (9), శివమ్ దూబే (8) స్వల్పస్కోర్లకే అవుటయ్యారు. అయితే తను మాత్రం వికెట్ కోల్పోకుండా జాగ్రత్తపడుతూ ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్న రుతురాజ్ గైక్వాడ్ (30) కూడా పెవిలియన్ చేరాడు.

రబాడ వేసిన బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన అతను టైమింగ్ మిస్సయ్యాడు. అంతకుముందు అదే మాదిరి వేసిన బంతిని బౌండరీకి తరలించిన అతను.. మరో బౌండరీ కోసం ప్రయత్నించాడు. అయితే బంతిని అంచనా వేయడంలో విఫలమవడంతో గాల్లోకి లేచిన బంతిని పంజాబ్ సారధి మయాంక్ అగర్వాల్ అందుకున్నాడు. దాంతో రుతురాజ్ గైక్వాడ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. 14.3 ఓవ‌ర్ల‌కు చెన్నై 114 ప‌రుగుల మాత్ర‌మే చేసి నాలుగు కీల‌క వికెట్లు కోల్పోయి క‌ష్టాల‌ను స్వాగ‌తిస్తున్న‌ట్టు ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement