Friday, April 26, 2024

పోలీసుల విచారణకు రొనాల్డొ

ప్రముఖ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ రొనాల్డొ పోలీసుల విచారణకు హాజరయ్యాడు. ఓ అభిమానితో అతడు దురుసుగా ప్రవర్తించినట్లు వీడియో వైరల్‌ అయిన నేపధ్యంలోఓ ఈ విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ఈ విషయాన్ని యుకెలోని మెర్సిసైడ్‌ పోలీసులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 9న గూడిసన్‌ పార్క్‌ వేదికగా జరిగిన మాంచెస్టర్‌ మ్యాచ్‌లో రొనాల్డొ టీమ్‌ 1-0 తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్‌ ముగిసాక ఆటగాళ్లు ఈ క్రమంలోనే ఓటమి కోపంతో ఉన్న రొనాల్డ్‌ ఓ ప్రేక్షకుడి ఫోన్‌ను నేలకేసి కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

అయితే ఈ సంఘటన అనంతరం ప్రపంచవ్యాప్తంగా రొనాల్డ్‌ తీరుపై విమర్శలు చెలరేగాయి. దీంతో అతడు అభిమానులకు క్షమాపణలు చెబుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. తాజాగా ఈ సంఘటనపై విచారణకు హాజరుకావాలని రొనాల్డోకు నోటీసులు పంపారు. దీంతో అతడు స్వతహాగా విచారణకు హాజరయ్యాడు. ” క్రిమినల్‌ డ్యామేజ్‌ ఆరోపణల క్రింద రొనాల్డొను విచారణకు పిలవగా ఆయన స్వతహాగా హాజరయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement