Friday, May 3, 2024

అక్టోబర్‌ ఏడు నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ -9

ప్రొకబడ్డీ లీగ్‌ సీజన్‌ -9 ఈ ఏడాది అక్టోబర్‌ ఏడు నుంచి ఆరంభం కానుంది. డిసెంబర్‌లో ముగియనున్న ఈ లీగ్‌కు బెంగుళూరు, హైదరాబాద్క, పూణలు వేదిక కానున్నాయి. ఈ మేరకు టోర్నీ నిర్వ హిస్తున్న మార్షల్‌ స్పోర్ట్స్‌ ప్రకటన విడుదల చేసింది. సీజన్‌ -9కు సంబంధించి ఆటగాళ్ల వేలం ప్రోగ్రాంను ఆగస్టు 5,6 తేదీల్లో నిర్వాహకులు పూర్తి చేశారు. ఈ సందర్బంగా మార్షల్‌ స్పోర్ట్‌ ్స హెడ్‌, పికెఎల్‌ కమిషనర్‌ అనుపమ్‌ గో స్వామి మాట్లాడుతూ … గ్రామీణ క్రీడ అయిన కబడ్డీ పీకెఎల్‌తో అంతర్జాతీయ గుర్తింపు లభించిందన్నారు. రానున్న రోజుల్లో కబడ్డీ ఆటను మరింత మందికి చేరువ చేసేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని తెలిపారు.
గత సీజన్‌లో కరోనా కారణంగా స్టేడియాల్లోకి ప్రేక్షకుల అనుమతి ఇవ్వలేదన్న ఆయన ఈసారి ప్రేక్షకుల సమక్షంలో సీజన్‌ -9 లీగ్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

పీకెఎల్‌ -9 పూర్తి షెడ్యూల్‌ను త్వరలో రిలీజ్‌ చేస్తామని తెలిపారు. ఇక గతేడాది నిర్వహించిన ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ -8 విజేతగా దబాంగ్‌ ఢిల్లి నిలిచింది. పట్నా పైరేట్స్‌ , దబాంగ్‌ ఢిల్లి జట్ల మధ్య జరిగిన ఫైనల్లో ఢిల్లి తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. హోరాహోరిగ సాగిన ఈ పోరులో 3736 తేడాతో ఢిల్లి జట్టు విజయ ఢంకా మోగించింది. దీంతో మూడుసార్లు టైటిల్‌ విజేత పట్నా పైరేట్స్‌ ఒక పాయింట్‌ తేడాతో పరాజయం పాలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement