Monday, April 29, 2024

Congratulations – అసియా క్రీడాకారుల‌కు ప్ర‌ధాని మోడీ ప్ర‌శంస‌ల జ‌ల్లు… మీ విజ‌యాల‌తో దేశం గ‌ర్విస్తున్న‌దంటూ ట్విట్

ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్స్‌ దుమ్మురేపుతున్నారు. చైనాలోని హంగ్జూ వేదికగా జరుగుతోన్న ఏషియా క్రీడల్లో భారత ప్లేయర్స్‌ పతకాల పంటను పండిస్తున్నారు. ఈసారి భారత ప్లేయర్స్‌ ఏకంగా 100 పతకాలు సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. భారత ఆటగాళ్లు ఈ అద్భుతాన్ని సాకారం చేసినందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్‌ వేదికగా పోస్ట్ చేసిన ప్రధాని ప్లేయర్స్‌ను ప్రశంసించారు. ఆసియా క్రీడల్లో భారత్‌ అద్భుత విజయం సాధించిందని తెలిపారు ప్రధాని.

భారత్‌ 100 పతకాల మైలు రాయిని చేరుకున్నందుకు భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. భారత్‌ ఈ చారిత్రాత్మక మైలురాయిను సాధించడానికి కారణమైన క్రీడాకారులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇక అక్టోబర్ 10వ తేదీన ఆసియా క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులను ప్రధాని కలవనున్నారు. దేశ ఖ్యాతిని పెంచిన క్రీడాకారులతో మాట్లాడడానికి తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement