Friday, May 17, 2024

వచ్చే ఏడాది గుజరాత్‌ టీమ్​లో ఆడనున్న పొలార్డ్‌..  వెల్లడించిన హార్దిక్​ పాండ్యా

కీరన్‌ పొలార్డ్‌ కీలక ఆటగాడు అని, వచ్చే ఐపీఎల్‌ గుజరాత్‌ తరఫున ఆడుతాడని హార్దిక్‌ పాండ్యా చెప్పుకొచ్చాడు. గతంలో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడిన పాండ్యా.. తొలిసారి ఈ సీజన్‌లో అదే జట్టుతో గుజరాత్‌ కెప్టెన్‌గా తలపడుతున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ తో తనకు ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నాడు. 2015 నుంచి ముంబై తరఫున ఆడానని, చెపాక్‌లో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌తో తనకు మంచి గుర్తింపు వచ్చిందని తెలిపాడు. ముంబైతో తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని, పొలార్డ్‌తో చాట్‌ చేశానని, అతనికి రిటైర్మెంట్‌ అభిందనలు కూడా తెలియజేశానని వివరించాడు. తాను ఎప్పుడూ బ్లూ జెర్సీలోనే ఆడుతున్నా అని, ఈసారి తన హోం స్టేట్‌ టీం అయిన గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున బ్లూ జెర్సీలోనే బరిలోకి దిగడం మరింత ప్రత్యేకం అని చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్‌ ఆటగాడిగా ఐపీఎల్‌ను ఎంతో ఎంజాయ్‌ చేశానని వివరించాడు. పొలార్డ్‌ గుజరాత్‌ జట్టులోకి రావాలని కోరుకుంటున్నాని తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement