Thursday, May 2, 2024

బీసీసీఐ రాజ్యాంగ సవరణలపై పిటిషన్‌ విచారణ.. అమికస్‌ క్యూరీగా మణీందర్‌ సింగ్‌..

న్యూఢిల్లి: బీసీసీఐ నియమావళిలో సవరణకు అవకాశమివ్వాలన్న అభ్యర్థనపై సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వకేట్‌ మణీందర్‌ సింగ్‌ను అమికస్‌ క్యూరీగా నియమించింది. విచారణకు జులై 28కి వాయిదా వేసింది. చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, జస్టిస్‌ కృష్ణ మురారీ, హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటి వరకు అమికస్‌ క్యూరీగా వ్యవహరించిన పీఎస్‌ నరసింహ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన నేపథ్యంలో ఈ నియామకం చేసినట్లు ధర్మాసనం పేర్కొంది. పాలక వర్గం కాలపరిమితి మార్పునకు సంబంధించి నియమావళిలో సవరణలకు అవకాశం కల్పించాలని కోరుతూ బీసీసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిదే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement