Sunday, April 28, 2024

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌.. సెమీస్‌లో పంత్‌కు చాన్స్‌

ఇంగ్లండ్‌తో గురువారం జరిగే సెమీసలోనూ రిషభ్‌ బరిలో దిగుతాడని చీఫ్‌ కోచ్‌ రహుల్‌ ద్రవిడ్‌ సూచనప్రాయంగా వెల్లడించాడు. చక్కటి ఫినిషర్‌గా పేరుండడంతో మెగా టోర్నీ సూపర్‌-12 నాలుగు మ్యాచ్‌ల్లో దినేశ్‌ కార్తీక్‌ పట్లే జట్టు యాజమాన్యం మొగ్గు చూపింది. కానీ బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న ఆసీస్‌ వికెట్లపై దినేశ్‌ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో జింబాబ్వేతో మ్యాచ్‌లో పంత్‌ను ఆడించారు. సెమీసలో లెగ్‌స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ను సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యం ఉన్నందునే ముందస్తుగా జింబాబ్వేపై పంత్‌ను ఆడించాలని ద్రవిడ్‌ నిర్ణయించినట్టు కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement