Sunday, May 19, 2024

ఆఫ్గన్-పాకిస్తాన్ సిరీస్ కు ఆమోదం తెలిపిన తాలిబన్లు

అవును మీరు చదివేది నిజమే..పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ కు తాలిబన్లు ఆమోదం తెలిపినట్టు పీసీబీ క్రికెట్ బోర్డు చెబుతోంది. తాలిబన్ల భావజాలం గురించి తెలిసిన వాళ్లకు పీసీబీ ప్రకటన నమ్మశక్యం ఆశ్చర్యం కలిగించేదే… తాలిబన్లు ఆధునిక మానవ వికాసానికి బద్ధ వ్యతిరేకులని అందరికీ తెలుసు. నవీన పోకడలు, కొన్ని రకాల క్రీడలకు తాలిబన్ల నిఘంటువులో చోటులేదు. మరీ అలాంటి తాలిబన్లు రాక్షస పాలన సాగిస్తారని అనుకున్న వాళ్లు ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ సిరీస్ కు ఆమోదం తెలపడంతో అందరూ నమ్మలేకపోతున్నారు. పాకిస్థాన్, ఆఫ్ఘన్ జట్ల మధ్య తటస్థ వేదిక శ్రీలంకలో వచ్చే నెలలో వన్డే సిరీస్ సెప్టెంబరు 1 నుంచి 5 వరకు జరగాల్సి ఉంది. ఆఫ్ఘన్ అధికార పగ్గాలు తాలిబన్లు చేజిక్కించుకోవడంతో ఈ సిరీస్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే తాలిబన్లు ఈ సిరీస్ కు సమ్మతించారంటూ పీసీబీ వెల్లడించింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: లండన్ రెస్టారెంట్‌లో విరుష్క లంచ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement