Monday, April 29, 2024

గుజరాత్ లో జాతీయ స్థాయి క్రీడా పోటీలు.. పిస్ట‌ల్ షూట్‌లో తెలంగాణ‌కు బంగారు పతకం

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 36వ‌ జాతీయ స్థాయి క్రీడలు జ‌రుగుతున్నాయి. ఈ క్రీడ‌ల్లో తెలంగాణకు తొలి బంగారు ప‌త‌కం వ‌చ్చింది. ఈ పోటీల్లో పాల్గొని 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ రేంజ్‌లో తెలంగాణకు చెందిన‌ ఈషాసింగ్ గోల్డ్ ప్రైజ్ ద‌క్కించుకుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర క్రీడాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అభినందించారు. మంగళవారం బి.ఆర్.కే.ఆర్. భవన్ లోని తన చాంబర్ లో బంగారు పతకం సాధించిన ఈషా సింగ్ ను ఆయన శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈషా సింగ్ తొలిసారిగా పాల్గొని బంగారు పతకం సాధించడంపై అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement