Thursday, May 2, 2024

బంగ్లాదేశ్ లో మెగా టోర్నీ- ఏపీ క్రికెట‌ర్ స‌బ్బినేని మేఘ‌న‌కు చోటు

అక్టోబ‌ర్ 1నుండి 15వ తారీఖు వ‌ర‌కు బంగ్లాదేశ్ లో మెగా టోర్నీ జ‌ర‌గ‌నుంది.ఈ మేర‌కు భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ.
మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టును ఆలిండియా మహిళల సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో మొత్తం 15 మందితో కూడిన జట్టును బుధవారం ప్రకటించింది. ఈ జట్టులో ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ సబ్బినేని మేఘనకు చోటు దక్కింది. ఈ టోర్నీలో మొత్తం ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. భారత్, పాకిస్థాన్, ఆతిథ్య బంగ్లాదేశ్‌, శ్రీలంక, యూఏఈ, థాయ్‌లాండ్‌, మలేసియా బరిలో నిలిచాయి.. తాలిబన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్ లో అమ్మాయిల ఆటపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆఫ్ఘన్ క్రికెట్‌ టీమ్‌ ఈ టోర్నీకి దూరంగా ఉంది. తొలి రోజు, అక్టోబర్1న భారత్–శ్రీలంక మధ్య మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 3, 4 వ తేదీల్లో భారత్.. వరుసగా మలేసియా, యూఏఈతో తలపడుతుంది. ఏడో తేదీన చిరకాల ప్రత్యర్థి పాక్‌ ను ఢీకొట్టనుంది. 8న బంగ్లాతో, 10న థాయ్‌లాండ్‌తో పోటీ పడుతుంది. 11, 13వ తేదీల్లో సెమీఫైనల్స్‌, 15న ఫైనల్‌ షెడ్యూల్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement