Saturday, April 20, 2024

వైద్యరంగంలో సంస్కరణల కర్త వైఎస్ఆర్.. సీఎం జగన్

వైద్యరంగంలో సంస్కరణల కర్త వైఎస్ఆర్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ… కార్పొరేట్ వైద్యాన్ని పేదల హక్కుగా మార్చారన్నారు. వైఎస్ఆర్ గొప్ప మానవతావాది, మహా శిఖరం అన్నారు. 1983కు ముందే టీడీపీ పుట్టక ముందే.. 8 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. మరో మూడు మెడికల్ కాలేజీల్ని వైఎస్ఆర్ పెట్టారన్నారు. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీల్ని కడుతున్నామన్నారు. ఒక్క మెడికల్ కాలేజీని కూడా కట్టని టీడీపీ వాళ్లకు కావాల్సిన పేరును బలవంతంగా పెట్టుకున్నారన్నారు. ఇన్ని మెడికల్ కాలేజీలు కడుతున్నప్పుడు వైఎస్ఆర్ పేరు పెడితే తప్పేంటని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement