Friday, May 3, 2024

Breaking: భారీ వర్షం కారణంగా మ్యాచ్​ రద్దు.. సిరీస్ స‌మం!

నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్‌కు వర్షం అంతరాయం క‌లిగించింది. మ్యాచ్ ఆరంభానికి నిమిషాల ముందు వర్షం పడటంతో.. మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత ఆట మొదలై 4 ఓవర్లు కూడా వెయ్యకుండానే మరోసారి వాన రాక‌తో అంతరాయం ఏర్ప‌డింది. చిన్నగా మొదలై.. భారీ వర్షంగా మారింది. దాంతో మళ్లీ ఆటగాళ్లు మైదానం వీడాల్సి వచ్చింది. ఇంకా వర్షం పడుతుండటంతో.. క్రీడాభిమానులు బీసీసీఐని తప్పుబడుతున్నారు.

- Advertisement -

రుతుపవనాలు ఆరంభమయ్యే సమయంలో బెంగళూరులో మ్యాచ్‌లు ఎలా నిర్వహిస్తార‌ని బీసీసీఐ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. కాగా, వర్షం అంతరాయం కలిగించే సమయానికి భారత జట్టు 3.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. క్రీజులో పంత్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. ఈ మ్యాచ్ కనుక వర్షం కారణంగా రద్దయితే.. సిరీస్‌ను డ్రాగా ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడు కప్పును రెండు బోర్డులూ పంచుకుంటాయి. కొంతకాలం ఇక్కడ, కొంతకాలం అక్కడ ఉంచుకుంటారని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement