Sunday, May 5, 2024

పంత్‌ను పక్కనబెట్టడమే బెటర్‌.. మాజీ క్రికెట‌ర్ల అభిప్రాయం

టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు కూర్పుపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ క్రికెటర్లతోపాటు, అభిమానులు కూడా టీమ్‌ ఆర్డర్‌పై నిశ్చితమైన అభిప్రాయాలు సూచిస్తున్నారు. తుది 11 మందిలో ఎవర్ని ఆడిస్తే మంచిదో విశ్లేషించి మరీ చెబుతున్నారు. ముఖ్యంగా రిషబ్‌పంత్‌, దినేశ్‌కార్తీక్‌లలో తుది జట్టులో ఎవరిని ఆడించాలన్నది పెద్ద ప్రశ ్నగా మారింది. దీనిపై భారత మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ తన అభిప్రాయం చెప్పాడు.

పంత్‌ను ఆడించాలా వద్దా అనేదానిపై మేనేజ్‌మెంట్‌ స్పష్టతకు రావాలని సూచించాడు. టెస్టులు, వన్డేల్లో పంత్‌ అద్భుతంగా రాణించినప్పటికీ, పొట్టిక్రికెట్‌లో అతను ప్రభావశీలి కాదని గుర్తుచేశాడు. అక్షర్‌పటేల్‌, దినేశ్‌ కార్తీక్‌ జోడీ బ్యాటింగ్‌ బాగుంటుందని చెప్పాడు. పంత్‌ను ఏ స్థానంలో ఆడిస్తారో స్పష్టతలేదని, ఇలాంటి సందిగ్ధంలో అతడిని పక్కనబెట్టడమే బెటర్‌ అని జాఫర్‌ సూచించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement