Saturday, May 4, 2024

IPL | అంపైర్లతో కోహ్లీ వాగ్వాదం.. మ్యాచ్ పీజులో 50 శాతం కోత..

విరాట్ కోహ్లీకి బీసీసీఐ అతడికి భారీ జరిమానా విధించింది. నిన్న (ఆదివారం) ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు కోహ్లీ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది.

నిన్నటి మ్యాచ్‌లో వివాదాస్పద ఔట్ అయిన తర్వాత మైదానంలోని అంపైర్లతో కోహ్లి తీవ్ర వాగ్వాదానికి దిగాడు…. దీంతో కోహ్లీ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ప్రకారం లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడు. ఈ నేరాన్ని కోహ్లీ కూడా అంగీకరించాడు. దీంతో మ్యాచ్ రిఫరీ అతనికి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించినట్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement