Sunday, May 5, 2024

Breaking: హైటెన్షన్​ మ్యాచ్​లో ఇండియాదే విజయం.. అదరగొట్టిన కెప్టెన్​ రోహిత్​

ఆస్ట్రేలియా, టీమిండియా రెండో మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు అద్భుతంగా రాణించారు. హైటెన్షన్​ మ్యాచ్​లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. తొలుత భార‌త బౌల‌ర్లు రెచ్చిపోయారు. ఆ తర్వాత బ్యాట్స్​మన్​ నిలకడగా ఆడి రాణించారు. రోహిత్ కెప్టెన్ 46 నాటౌట్​గా నిలిచి.. తన ఇన్నింగ్స్​తో సూపర్​గా ఆకట్టుకున్నాడు.​ తనదైన స్టైల్​లో ఆడి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.

అయితే.. 39 పరుగుల స్కోరు వద్ద కేఎల్​ రాహుల్​ (10) పరుగులు  చేసి అవుటయ్యాడు. దీంతో కోహ్లీ రంగంలోకి దిగాడు. ఇక కాస్త పర్వాలేదు, బాగానే అడుతున్నారు అనుకున్న టైమ్​లోనే కోహ్లీ కూడా (11) పరుగులకే బౌల్డ్​ అయ్యాడు. బ్యాటింగ్​కు వచ్చిన సూర్యకుమార్​ ఫస్ట్​ బంతికే డకౌట్​గా పెవిలియన్​ చేరాడు. దీంతో 3 వికెట్లు కోల్పోయి భారత్​ కాస్త ఇబ్బందుల్లో పడ్డట్టు అనిపించింది. కాగా, హార్దిక్​ పాండ్యా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. (9) పరుగులు మాత్రమే చేసి క్యాచ్​ అవుటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement