Thursday, April 25, 2024

మూడో రోజు ఆట ప్రారంభంలోనే టీమిండియాకు షాక్

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌లో భాగంగా సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మూడు రోజు ఆట ప్రారంభంలోనే భారత్ కష్టాల్లో పడింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ చేజార్చుకుంది. 44 పరుగులు చేసిన కోహ్లీ కివీస్ పేసర్ కైల్ జేమీసన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. మరోవైపు క్రీజులోకి వచ్చీ రాగానే పంత్ కూడా 4 పరుగులకే ఔటయ్యాడు. పంత్ వికెట్ కూడా జేమీసన్‌కే దక్కింది. దీంతో భారత్ 156 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.

భారత ఇన్నింగ్స్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా ఓపెనర్లు రోహిత్ శర్మ 34, శుభ్‌మన్ గిల్ 28 పరుగులు చేశారు. పుజారా 8 పరుగులకే అవుట్ కాగా, కోహ్లీ-రహానే జోడీ కీలక భాగస్వామ్యంతో జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. ఈ జోడీని జేమీసన్ విడదీశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement