Saturday, May 4, 2024

IND vs SL : శ్రీలంక టార్గెట్ 358 పరుగులు

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య ఐసీసీ వరల్డ్ కప్ 32వ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేపట్టింది.

భారత్ బ్యాట్స్ మెన్లు కెప్టెన్ రోహిత్ శర్మ త్వరగా 4పరుగులకే ఔట్ అయినా.. ఆతర్వాత శుభమాన్ గిల్ 92 పరుగులు, విరాట్ కోహ్లీ 88 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 82 పరుగులు చేశారు. దీంతో భారత్ స్కోరు భారీగా దూసుకెళ్లింది. నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. శ్రీలంక జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 358 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement