Sunday, April 28, 2024

Ind vs Eng, 5th Test : కష్టాల్లో ఇంగ్లండ్…92కే నాలుగు వికెట్లు డౌన్

ధర్మశాలలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ఆట కొనసాగుతోంది. అయితే ఇవాళ ఉదయం ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే భారత్ జట్టు 477 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు కష్టాల్లో పడింది. 92 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది.

ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే పరుగులేమీ చేయకుండానే డకౌట్ కాగా, బెన్ డకెట్ రెండు పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆతర్వాత ఒల్లీ పోప్ కూడా 19 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో జైస్వాల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అలాగే జానీ బెయిర్ స్టో 31 బంతుల్లో 39 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. నాలుగు వికెట్లు కోల్పోగా.. జో రూట్ 28 పరుగులతో ఉండగా, తనకు తోడుగా బెన్ స్టోక్స్ వచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement