Wednesday, May 1, 2024

IND vs ENG, 4th Test : ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ స్కోర్ 219/7

రాంచీ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. భారత్ జట్టు బ్యాటింగ్ లో య‌శ‌స్వీ జైశ్వాల్ మిన‌హా మిగిలిన బ్యాట‌ర్స్ స్వ‌ల్ప స్కోర్ల‌కే వెనుతిరిగారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులకు ఆలౌట్ అయింది.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 7వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. జైస్వాల్ 73 పరుగులు, శుభమాన్ గిల్ 38 పరుగులకు ఔట్ కాగా, జురెల్ 30 పరుగులు, కుల్దీప్ యాదవ్ 17 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. దీంతో 134 పరుగుల లీడ్ లో ఇంగ్లండ్ జట్టు ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement