Tuesday, April 30, 2024

Ind vs Eng, 2nd Test : ముగిసిన తొలిరోజు ఆట.. భారత్ స్కోరు 336/6

విశాఖ‌ప‌ట్నంలోని వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న టీమ్‌ఇండియా ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది.

ఓపెనర్‌ యశస్వి జైస్వాల్ 179 పరుగులతో నాటౌట్ ఉన్నాడు. భారత్ బ్యాట్స్ మెన్లు శుభ్‌మన్‌ గిల్‌ (34), రజత్‌ (32), శ్రేయస్‌ అయ్యర్‌ (27), అక్షర్‌ పటేల్‌ (27) పరుగులు చేశారు. కెప్టెన్‌ రోహిత్ శర్మ (14) పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లు షోయబ్‌ బషీర్‌ 2, రెహాన్‌ 2, జేమ్స్‌ అండర్సన్‌, టామ్‌ హార్ట్‌లీ ఒక్కో వికెట్‌ తీశారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 6వికెట్లు కోల్పోయిన భారత్ 336 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement