Wednesday, May 1, 2024

Ind vs Eng 1st Test : లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 222/3..

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ జట్టు 222 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. భారత్ బ్యాట్స్ మెన్లు కేఎల్ రాహుల్ 55 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టు 246 పరుగులకు ఆలౌట్ కాగా… భారత్ జట్టు లంచ్ బ్రేక్ సమయానికి 222 పరుగులు చేయడంతో 24 పరుగుల వెనుకంజలో ఉంది. ఇప్పటి వరకు భారత్ జట్టు మూడు వికెట్లు మాత్రమే కోల్పోవడంతో భారీ స్కోర్ చేసే అవకాశముంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement