Thursday, May 2, 2024

Ind vs Eng Test : భారత్ కు భారీ లీడ్.. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు 246 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు భారీ లీడ్ ను సాధించింది.

భారత్ బ్యాట్స్ మెన్లు రవీంద్ర జడేజా 87 పరుగులు, కేఎల్ రాహుల్ 86 పరుగులు, యశస్వి జైస్వాల్ 80 పరుగులు, అక్షర్ పటేల్ 44 పరుగులు, శ్రీకర్ భరత్ 41 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 35 పరుగులు, రోహిత్ శర్మ 24 పరుగులు చేశారు. మూడో రోజు భారత్ జట్టు 436 పరుగులకు ఆటౌల్ అయ్యింది. దీంతో భారత్ జట్టు 190 పరుగుల లీడ్ లో ఉంది. భారత్ జట్టు ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement