Wednesday, May 1, 2024

చెపాక్ స్టేడియంలో ఐసీసీ అధికారులు.. పిచ్, అవుట్‌ఫీల్డ్‌పై తనిఖీలు..

ICC పురుషుల వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ కి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. దీంతో టోర్నీలో భార‌త్ మెద‌టి మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వ‌నున్న M.A. చిదంబరం స్టేడియంపై అందరి దృష్టి ప‌డుతోంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియా-భారత్ మొదటి మ్యాచ్‌కు ఈ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా, ప్రస్తుతం పూర్తి స్థాయిలో మ్యాచ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.

పిచ్, ఔట్ ఫీల్డ్ ని పరిశీలించడానికి ఐసిసి హెడ్ క్యూరేటర్, ఆండీ అట్కిన్సన్ శుక్రవారం వేదికను సందర్శించారు. ఈ స్టేడియం – ఐదు ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది ప్రపంచ కప్‌కు ముందు, స్టేడియంలోని నాలుగు ఫ్లడ్‌లైట్ టవర్లలో కొత్త LED లైట్లు అమర్చారు, ఈ లైట్లు పాత వాటికంటే 40-50 శాతం ఎక్కువ శక్తిని కలిగి ఉన్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement