Friday, May 10, 2024

లక్నో మెంటార్‌గా గంభీర్‌

ఐపీఎల్‌ 2022లో అరంగేట్రం చేయనున్న లక్నో ఫ్రాంచైజీ తమ జట్టు మెంటార్‌గా గౌతమ్‌ గంభీర్‌ వ్యవహరిస్తాడని ప్రకటించింది. ఫ్రాంచైజీ యజమాని గోయెంకా ఆర్‌పీఎస్‌జీ కుటుంబంలోకి స్వాగతం పలికాడు. మెగా వేలానికి ముందు లక్నో యాజమాన్యం అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటుంది.

ఇప్పటికే లక్నో జట్టు హెడ్‌కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్‌ ఆండీఫ్లవర్‌ను నియమిచింది. కాగా గౌతమ్‌ గంబీర్‌ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సారథిగా రెండుసార్లు జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. బీజేపీ ఎంపీగా ఉన్న 40ఏళ్ల గౌతమ్‌ గంబీర్‌ భారత్‌ తరఫున 58టెస్టులు, 147వన్డేలు, 37టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement