Wednesday, May 22, 2024

అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీకి బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్‌

ఐపీఎల్‌ 15వ సీజన్‌లో టైటిల్‌ కోసం బరిలోకి దిగనున్న అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీకి బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. బెట్టింగ్‌ సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీవీసీ క్యాపిటిల్‌ ఐపీఎల్‌లో ప్రవేశించేందుకు లైన్‌క్లియర్‌ అయింది. సీవీసీ క్యాపిటల్‌పై దర్యాప్తు చేసిన బీసీసీఐ లీగల్‌ కమిటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని బోర్డువర్గాలు ప్రకటించాయి.

కాగా అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సీవీసీ క్యాపిటల్‌కు బెట్టింగ్‌ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో దర్యాప్తు చేసిన బీసీసీఐ లీగల్‌ కమిటీ క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement