Monday, May 20, 2024

Asia Cup – ఆగ‌ని వ‌ర్షం….భార‌త్ – పాక్ మ్యాచ్ కు బ్రేక్

ఆసియా కప్ లో భారత్ ఆడే మ్యాచ్ లను వరుణుడు వెంటాడుతున్నాడు. కొన్నిరోజుల కిందట భారత్, పాకిస్థాన్ లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయింది. ఇప్పుడు సూపర్-4 దశలోనూ ఈ రెండు జట్లు తలపడగా, వర్షం మరోసారి ప్రత్యక్షమైంది. టీమిండియా 24.1 ఓవర్లలో 2 వికెట్లకు 147 పరుగులు చేసిన దశలో వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఓ మోస్తరు వర్షం పడడంతో మైదానాన్ని కవర్లతో కప్పివేశారు.
వర్షంతో అంతరాయం కలిగే సమయానికి కేఎల్ రాహుల్ 17, విరాట్ కోహ్లీ 8 పరుగులతో ఆడుతున్నారు. అంతకుముందు, కెప్టెన్ రోహిత్ శర్మ 56, శుభ్ మాన్ గిల్ 58 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 1, షహీన్ అఫ్రిది 1 వికెట్ తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement