Friday, April 26, 2024

4th test: జట్టు స్కోరు 28 వద్ద ఔటైన టీమిండియా ఓపెనర్లు

ఇంగ్లండ్ తో జరుగుతున్న 4 వ టెస్టు లో టీమిండియా ఓపెనర్లు వెంట వెంటనే ఔటయ్యారు. టెస్ట్‌ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఇంగ్లండ్‌ పేసర్‌ క్రిస్‌ వోక్స్‌.. తాను వేసిన తొలి ఓవర్లోనే టీమిండియాకు భారీ షాకిచ్చాడు. కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతిని సంధించి రోహిత్‌ శర్మ(11; ఫోర్‌)ను బోల్తా కొట్టించాడు. వికెట్‌కీపర్‌ బెయిర్‌స్టో అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో రోహిత్‌ పెవిలియన్‌ బాట పట్టక తప్పలేదు. 9 ఓవర్ల అనంతరం టీమిండియా స్కోర్‌ 28/1. అనంతరం కాసేపటికే అదే స్కోరు వద్ద మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా ఔటయ్యాడు. రాబిన్ సన్ బౌలింగ్ లో రాహుల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. రాహుల్ రివ్యూ తీసుకున్నప్పటికి నాటౌట్ కాలేకపోయాడు. అయితే రివ్యూ మాత్రం మిగిలిపోయింది.

ఇది కూడా చదవండి: Pawan birthday: మరోసారి కరో కరో జర జల్సా అన్న DSP

Advertisement

తాజా వార్తలు

Advertisement