Saturday, March 23, 2024

2nd ODI : ఆసీస్ టార్గెట్ 118 ప‌రుగులు

విశాఖ‌ప‌ట్నంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగనున్న రెండో వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 26 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆసీస్ జ‌ట్టు విజ‌య‌ల‌క్ష్యాన్ని చేరుకోవాలంటే 118 ప‌రుగులు చేయాల్సి ఉంది. భార‌త్ జ‌ట్టు బ్యాట్స్ మెన్లు విరాట్ కోహ్లీ 31 ప‌రుగులు, అక్ష‌ర్ ప‌టేల్ 28 ప‌రుగులు, ర‌వీంద్ర జ‌డేజా 16 ప‌రుగులు చేశారు. ఆసీస్ బౌల‌ర్లు మిట్చెల్ స్టార్క్ ఐదు వికెట్లు, అబ్బాట్ మూడు వికెట్లు, నాథ‌న్ ఎలీస్ రెండు వికెట్లు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement