Thursday, April 25, 2024

రైతులను ఆదుకోవాలి.. మంత్రి నిరంజన్ రెడ్డికి నేతల వినతి

గత మూడురోజుల నుండి కురుస్తున్న భారీ వడగళ్ల వానకి నష్టపోయినా రైతులను అదుకోవాలని, పంట నష్టపరిహారం ఇవ్వాలని నేతలు మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. మినిస్టర్స్ క్వాటర్ లో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఎంపీ విహెచ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కలిశారు. అనంతరం ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అనుకోకుండా అకాల వడగళ్ల వాన కురవడంతో కూరగాయల పంట, వరి ఇతర పంటలు నష్టపోయాయన్నారు. నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని మంత్రిని కోరడం జరిగిందన్నారు. కూరగాయల పంటకు రూ.35వేలు, వరి పంటకు రూ.12వేలు అలాగే నష్టపోయిన ఇతర పంటలకు ఇవ్వాలని కోరామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ పంట నష్టపోయిందో పరిశీలించాలని చెప్పామన్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పంట నష్టపోయిన ప్రాంతాలు విజిట్ చేస్తామన్నారు. వెంటనే రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ అకాల వర్షాలకు రాష్ట్రంలో అనేక చోట్ల ఇండ్లు కూలిపోయాయిన వారికి కూడా ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వాలని కోరామ‌న్నారు. అలాగే మంత్రి చెయ్యి ఫ్రాక్చర్ కావ‌డంతో యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. వరికి ఎకరానికి 12వేలు ఇవ్వాలని, కూరగాయలకు, ఆకు కూరలకు ఎకరానికి రూ.35వేలు ఇవ్వాలని, మొక్కజొన్న ఎకరానికి రూ.15వేలు ఇవ్వాలని, మామిడి తోట ఎకరానికి రూ.50 వేలు ఇవ్వాలని, కోళ్ల ఫారాలు, డైరీ ఫారాలకు వడ్డీ మాఫీ చేయాలని, ధాన సబ్సిడీ ఇవ్వాలని, షెడ్ల పున్నరినిర్మాణానికి ఆర్ధిక సహాయం చేయాలని, పూర్తిగా నష్టపోయిన రేకులతో కట్టిన ఇండ్లకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement