Saturday, May 18, 2024

Breaking: ద‌క్షిణాఫ్రికాకు 180 ప‌రుగుల టార్గెట్‌.. బౌల‌ర్లు రాణిస్తేనే ఇండియా విజ‌యం!

విశాఖ‌లో ఇవ్వాల భార‌త్‌, ద‌క్షిణాఫ్రిక మ‌ధ్య జ‌రుగుతు టీ20 మ్యాచ్‌లో ఇండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 179 పరుగులు చేసింది. దీంట్లో ఓపెన‌ర్లు రుతురాజ్‌, ఇషాన్ కిష‌న్ భాగ‌స్వామ్యం చాలా బాగుంది. ఆ త‌ర్వాత వ‌చ్చిన బ్యాట్స్‌మ‌న్ కుదురుకునే లోపే వికెట్లు ప‌డిపోయి పెవిలియ‌న్‌కు చేరారు. ఎట్ట‌కేల‌కు భార‌త్ 179 ప‌రుగుల గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరు చేయ‌గ‌లిగింది.

ఇక ఇండియ‌న్ బౌల‌ర్లు దీటుగా ఆడితేనే ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించే చాన్సెస్ ఉన్నాయి. లేకుంటే ఈ మ్యాచ్ కూడా అంతే సంగ‌తి అనే ప‌రిస్థితి ఉంది. దీంతో సిరీస్ సౌథాఫ్రికా వ‌శం కావాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని క్రికెట్ అన‌లిస్టులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement