Tuesday, May 21, 2024

‘మనోడు ఏం మారలేదు’.. సెహ్వాగ్ ఆటపై ట్రెండింగ్ మీమ్స్

బంగ్లాదేశ్‌ లెజెండ్స్‌తో శుక్రవారం జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ తొలి మ్యాచ్‌లో భారత్ లెజెండ్స్ జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సెహ్వాగ్ (80), సచిన్ (33) అజేయంగా నిలిచారు. కరోనా కారణంగా గత సంవత్సరం నాలుగు మ్యాచుల తర్వాత వాయిదా పడిన ఈ సిరీస్ శుక్రవారం రాయ్‌పూర్‌‌లో షాహీద్ వీర్ నారాయణ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తిరిగి ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ లెజెండ్స్ జట్టు 19.4 ఓవర్లలో 109 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండుల్కర్ బంగ్లాదేశ్ బౌలర్లపై చెలరేగారు. ఈ నేపథ్యంలో తాను ఎదుర్కొన్న తొలి బంతికే సెహ్వాగ్ బౌండరీ సాధించాడు. దీంతో వయసు మీద పడ్డా సెహ్వాగ్ ఆట ఏం మారలేదని సోషల్ మీడియాలో మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement