Monday, April 29, 2024

గోవాలో పెళ్లి జరుగుతుందని మీడియాలో కథనాలు

టీమిండియా క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రా ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు ఆడకుండా వ్యక్తిగత కారణాలతో బీసీసీఐ నుంచి సెలవు తీసుకున్న అతడు.. ఈనెల 14న గోవాలో అతడు వివాహం చేసుకుంటున్నాడని మీడియాలో కథనాలు వస్తున్నాయి. కొద్దిమంది అతిథులు, బంధుమిత్రులు ఈ పెళ్లికి హాజరుకానున్నారని సమాచారం. అయితే బుమ్రాకు భార్య ఎవరు అన్న విషయంపై కొద్దిరోజుల నుంచి మీడియా చాలా హడావిడి చేసింది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంజనా గణేశన్ బుమ్రా జీవిత భాగస్వామి అని తెలుస్తోంది. ఒకవేళ బుమ్రా వివాహం ఈనెల 14న జరిగేది నిజమే అయితే అతడు ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరం కానున్నాడు. అంటే వివాహం తర్వాత బుమ్రా నేరుగా ఐపీఎల్‌లో బరిలోకి దిగతాడన్నమాట.

Advertisement

తాజా వార్తలు

Advertisement