Saturday, May 11, 2024

తడబడ్డ వైసీపీ ఎమ్మెల్యే.. సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రచారం

ఒక్కోసారి రాజకీయ నేతలు తడబడుతూ మాట్లాడుతుంటారు. కట్ చేస్తే అవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటాయి. దీంతో వాళ్లు అడ్డంగా బుక్కయిపోతుంటారు. ఇదే తరహాలో ఓ వైసీపీ ఎమ్మెల్యే తడబడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆదివారం నాడు జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి జయలక్ష్మీ, వైసీసీ ఎంపీటీసీ అభ్యర్థి గంటా శ్రీలక్ష్మీ తరఫున ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగించేందుకు మైక్ అందుకున్నారు. ప్రజలకు మంచి జరగాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. దీంతో అప్పటివరకు దండం పెడుతూ ఎమ్మెల్యే పక్కన నిలుచున్న అభ్యర్థులు ఒక్కసారిగా షాక్ తిని ఎమ్మెల్యే వైపు చూశారు. ప్రచార వాహనం చుట్టూ ఉన్నవారు కూడా నవ్వులు చిందించారు. వెంటనే తన మాటల్లో తేడా ఉందని గ్రహించిన ఎమ్మెల్యే కవర్ చేసుకుని సైకిల్ గుర్తుపై ఓటేయాలని జోక్ చేశానని చెప్పుకొచ్చారు. కాగా ఎమ్మెల్యే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement