Friday, April 26, 2024

ఏడాదిపాటు ష‌ర్మిల పాద‌యాత్ర..

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల అక్టోబ‌ర్ నుంచి ష‌ర్మిల పాద‌యాత్ర చేప‌ట్ట‌బోతున్న‌ట్టు గ‌తంలోనే ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. అయితే, పాద‌యాత్ర‌కు సంబంధించిన రూట్ మ్యాప్‌ను విధివిధానాల‌పై ష‌ర్మిల ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌తో ఇప్ప‌టికే చ‌ర్చించారు. గ‌తంలో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలంగాణ‌లో చేప‌ట్టిన ప్ర‌జా ప్ర‌స్థానం యాత్ర పేరుతోనే యాత్రను కొన‌సాగించాల‌ని వైఎస్ ష‌ర్మిల నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది.  గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎక్క‌డి నుంచైతే పాద‌యాత్ర‌ను ప్రారంభించారో అక్క‌డి నుంచే అంటే చేవెళ్ల నియోజ‌క వర్గం నుంచే పాద‌యాత్ర‌ను చేప‌ట్టేందుకు ష‌ర్మిల సిద్ధం అవుతున్నారు.  ఏడాదిపాటు పాద‌యాత్ర కొన‌సాగేలా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంటున్నారు.  చేవెళ్లలో ప్రారంభించి తిరిగి చేవెళ్లలో ముగిసేలా పాద‌యాత్ర రూట్ మ్యాప్‌ను రూపొందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Old city: భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్న బండి సంజ‌య్‌..

Advertisement

తాజా వార్తలు

Advertisement