Thursday, April 25, 2024

Old city: భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్న బండి సంజ‌య్‌..

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఈ రోజు హైద‌రాబాద్‌లోని చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యాన్ని దర్శించుకున్నారు. నిన్న హుస్నాబాద్‌లో ఆయ‌న తొలి ద‌శ పాద‌యాత్ర ముగిసింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యానికి చేరుకుని అమ్మ‌వారి ఆశీర్వాదం తీసుకున్నారు అమ్మ‌వారికి ఆయ‌న ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆయ‌న‌తో పాటు ప‌లువురు బీజేపీ నేత‌లు కూడా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఆయ‌న తెలంగాణ‌లో పాద‌యాత్ర చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. బీజేపీని తెలంగాణ‌లో అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న పాద‌యాత్ర చేప‌ట్టారు. ఇక ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న హుజూరాబాద్‌లో నేటి నుంచే ఆయ‌న ప్ర‌చారం ప్రారంభించ‌నున్నారు. ఇప్ప‌టికే హుజూరాబాద్ ఎన్నిక‌కు ఇప్ప‌టికే నోటిఫికేష‌న్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.

ఇది కూడా చదవండి: తిరుమల సర్వదర్శనం: వ్యాక్సినేషన్ పూర్తయినట్టు సర్టిఫికెట్ ఉంటేనే భక్తులకు అనుమతి..

Advertisement

తాజా వార్తలు

Advertisement