Friday, May 17, 2024

ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించిన వైఎస్ షర్మిల

నందమూరి తారకరామారావు 98వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబీకులు, టీడీపీ శ్రేణులు పలువురు స్పందించారు. తాజాగా దివంగత వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల కూడా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.

నాడు పటేల్, పట్వారీ వ్యవస్థలను ఎన్టీఆర్ రద్దు చేశారని షర్మిల కొనియాడారు. బీసీలకు చట్టసభల్లో రాజకీయ అవకాశాలు, మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని షర్మిల కీర్తించారు. ముఖ్యంగా, రెండు రూపాయలకే కిలోబియ్యంతో పేదవాడి ఆకలిని తీర్చారని స్మరించుకున్నారు. ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా వారి సంక్షేమాన్ని గుర్తుచేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ పత్రికలో సంక్షేమంలో స్వర్ణయుగం అంటూ ఎన్టీఆర్ పై వచ్చిన కథనాన్ని కూడా ఆమె పంచుకున్నారు. కాగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి కూడా ఆకాంక్షించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement