Sunday, April 28, 2024

ఏపీలో హెల్త్ హ‌బ్‌లు.. వైద్యం కోసం పక్కరాష్ట్రాలకు వెళ్లొద్దు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వైద్య రంగంపై ప్ర‌త్యేక దృష్టిసారించింది. క‌రోనా నేప‌థ్యంలో ఎదురైన స‌వాళ్ల‌ను దృష్టిలో ఉంచుకుని.. రాష్ట్రంలో హెల్త్ హ‌బ్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. శుక్రవారం కోవిడ్ పై సమీక్ష సీఎం నిర్వ‌హించిన సీఎం వైఎస్ జ‌గ‌న్.. ప్రజలు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ వైద్యానికి ఎందుకు వెళ్లాల్సి వస్తోందని అన్నారు. జిల్లా ప్రధాన కేంద్రాలు, ఆ జిల్లాల్లోని నగరాల్లో హెల్త్‌ హబ్‌ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కనీసం 16 చోట్ల ఈ హెల్త్‌ హబ్‌లను ఏర్పాటు చేయాల‌ని.. జిల్లా కేంద్రాలతోపాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రి కలుపుకుని మొత్తం 16 చోట్ల హెల్త్‌ హబ్‌లు ఉండాల‌ని సూచించారు. ఒక్కో చోట కనీసంగా 30 నుంచి 50 ఎకరాలు సేకరించాల‌ని.. ఒక్కో ఆస్పత్రికి 5 ఎకరాలు చొప్పున కేటాయించాల‌ని ఆదేశించారు.

మూడేళ్లలో కనీసంగా రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు ఈ భూములు ఇవ్వాల‌ని సీఎం జగన్ సూచించారు.  దీనివల్ల కనీసంగా 80 మల్టీ, సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు వస్తాయని పేర్కొన్నారు. వీటితోపాటు ప్రభుత్వం తరఫున కొత్తగా మరో 16 వైద్యకళాశాలలు, నర్సింగ్‌కాలేజీలు వస్తున్నాయ‌ని తెలిపారు. ప్రభుత్వ పరంగా ఆరోగ్య రంగం బలోపేతం కావడంతోపాటు, మనం ఇచ్చే ప్రోత్సాహం కారణంగా ప్రైవేటు రంగంలో కూడా మంచి ఆస్పత్రులు వ‌స్తాయ‌నే ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. ఈ పాలసీ వల్ల ప్రతి జిల్లాకేంద్రంలో, కార్పొరేషన్లలో మల్టీస్పెషాల్టీ, స్పెషాల్టీ ఆస్పత్రులు వ‌స్తాయ‌న్నారు. దీనివల్ల టెరిషరీ కేర్‌ విస్తృతంగా మెరుగుపడుతుంద‌ని.. ఇతర ప్రాంతాలకు వైద్యానికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండ‌ద‌న్నారు. ఆరోగ్య శ్రీ పథకం కింద రోగులకు కూడా మంచి ప్రమాణాలతో వైద్యం అందుతుందన్నారు.

ఒకనెలరోజుల్లో కొత్త‌ పాలసీని తీసుకురావాలని అధికారుల‌ను సీఎం జగన్ ఆదేశించారు. అలాగే వ్యాక్సిన్‌ తయారీ కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో తయారయ్యేలా కూడా తగిన చర్యలు తీసుకోవాలన్న ఆయ‌న‌.. దీనిపైకూడా ఒక విధానాన్ని తీసుకురావాల‌న్నారు.

ఇదీ కూడా చదవండి:ఆనందయ్య మందు పంపిణీపై క్లారిటీ

Advertisement

తాజా వార్తలు

Advertisement