Thursday, May 2, 2024

షర్మిల దీక్షను భగ్నం చేసిన పోలీసులు

హైదరాబాద్ ఇందిరాపార్కులో వైఎస్ షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు ఇచ్చిన గడువు ముగియడంతో షర్మిల తన దీక్షను ముగించుకుని లోటస్ పాండ్‌కు కాలినడకన బయలుదేరి వెళ్లారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్‌తో షర్మిల 72 గంటల దీక్షకు అనుమతి కోరగా తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు మాత్రమే అనుమతి జారీ చేసింది. దీంతో ఇందిరాపార్క్ దీక్షా శిబిరం వద్దకు పోలీసులు చేరుకుని షర్మిలను దీక్ష ముగించాలని కోరారు. కాగా లోటస్ పాండ్‌లో షర్మిల తన దీక్షను కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.  తన దీక్షను ఎవరు అడ్డుకున్నా, ఎక్కడికి తీసుకెళ్లినా 72 గంటల పాటు దీక్షను కొనసాగిస్తానని షర్మిల ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement