Friday, May 10, 2024

మంగినపూడి బీచ్‌లో విషాదం.. యువకుడు మృతి

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. గుడివాడ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు సముద్రంలో స్నానం చేస్తుండగా.. అభినయ బోస్ అనే యువకుడు గల్లంతయ్యాడు. వెంటనే మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా అభినయ బోస్ మృతదేహంగా లభ్యమయ్యాడు. దీంతో ఒక్కసారిగా మంగినపూడి బీచ్ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా సముద్రంలో స్నానానికి వెళ్లిన యువకుడు గుడివాడ ఏఎస్ఆర్ కాలేజీలో బీఎస్సీ చదువుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement