Sunday, April 28, 2024

ఇంతకాలం గాడిదలు కాశావా?: అశోక్ గజపతిపై విజయసాయిరెడ్డి ఫైర్

మన్సాస్ ట్రస్ట్ కార్యాలయంలో ఆడిట్ జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ‘అధికారం పోయాక అశోక్ గజపతి అసలు గుట్టు బయట పడుతోంది. 2004 నుంచి మాన్సాస్ ట్రస్టులో అసలు ఆడిటింగే జరగలేదు. ఆడిటింగ్ కోసం డబ్బులిచ్చేశాం. అధికారులు వివరాలివ్వాలని లేఖలు రాస్తే ఏం లాభం. ఇంతకాలం గుడ్డి గుర్రం పళ్లుతోమావా? గాడిదలు కాస్తున్నావా రాజా? రాజ్యం చంద్రబాబు భోజ్యంలా చేశావు’ అని విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శించారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్ర‌బాబుపైనా విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘తల్లి పాలు తాగి రొమ్ముగుద్దినట్లు పిల్లను, పదవిని ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం. చిత్తూరు జిల్లాలో 1.10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే 3 రిజర్వాయిర్లను అడ్డుకునేందుకు ఎన్జీటీలో పిటిషన్లు వేయించాడు. నీకెందుకు జన్మనిచ్చానా అని సొంత జిల్లా కన్నీరు పెడుతోంది బాబూ’ అంటూ విమర్శలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement