Tuesday, April 30, 2024

విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

కోర్టు షరతులు ఉల్లంఘించారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖ‌లు చేసిన‌ పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ మేరకు తదుపరి విచార‌ణను సీబీఐ కోర్టు ఈ నెల 13కు వాయిదా వేసింది.

కాగా బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణలో భాగంగా విజయసాయిరెడ్డికి, సీబీఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. ర‌ఘురామ వేసిన‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే కౌంటర్‌ దాఖలుకు మరింత గడువు కావాలని సీబీఐ అధికారులు కోరారు. ఈ నేప‌థ్యంలోనే విచార‌ణ వాయిదా ప‌డింది. ఇప్ప‌టికే అక్ర‌మాస్తుల కేసులో సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని ర‌ఘురామ వేసిన పిటిష‌న్‌పై కూడా కోర్టులో విచార‌ణ కొన‌సాగుతోంది.

ఈ వార్త కూడా చదవండి: ‘పప్పు’ అనే పదాన్ని నిషేధించిన అసెంబ్లీ

Advertisement

తాజా వార్తలు

Advertisement